మారండ్రా నాయనా ! వైరల్ అవుతున్న కత్తి మహేష్ పోస్ట్

  • 7 years ago
Tollywood Movie Critic Mahesh katti posted a photo with Hyper Aadi who is Teased him in Jabardasth show

ఈ మధ్య పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీ దగ్గర్నుంచీ మహేష్ కత్తి ఎదుర్కుంటున్న సమస్యలు మనందరికీ తెలిసినవే అదే సమయం లో హైపర్ ఆది కూడా మహేష్ కత్తిని టార్గెట్ చేస్తూ ఒక స్కిట్ వేసాడు.
బిగ్ బాస్‌ షోలో పాల్గొన్న తర్వాత మహేశ్ కత్తి పవన్ కల్యాణ్ ను విమర్శలు చేయడంతో.. పవన్ ఫ్యాన్స్ అతడిని తీవ్రంగా విమర్శించారు. తనను బెదిరిస్తూ.. భారీగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని గతంలో కత్తి మహేశ్ వాపోయాడు. ఫేస్‌బుక్ లైవ్ సందర్భంగా కత్తి మహేశ్ బదులిస్తూ.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సైలెంట్‌గా ఉండటమే అతడికి మంచిదని సలహా ఇచ్చాడు.
అయితే హైపర్ ఆది వేసిన పంచ్ కి రియాక్ట్ అవుతూ ఫేస్బుక్ వీడియొ ద్వారా కాస్త ఘాటుగా నే సమాధానమిచ్చాడు. ఆ గొడవ అక్కడితో అయిపోతే బాగానే ఉండేది గానీ మళ్ళీ కొత్తగా ఈ ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ ఫొటోలకి ఫోజులిచ్చారు. పైగా ఆ ఫొటో తెచ్చి తన వాల్ మీదకూడా పోస్ట్ చేసిన మహేష్ కత్తి జనాలకి షాకిచ్చాడు.
బుధవారం హైదరాబాద్‌లో "లండన్ బాబులు" ప్రీమియర్ షో వేసింది చిత్ర యూనిట్. దీనికి పలువురు సినీ ప్రముఖులతో పాటు కత్తి మహేశ్, హైపర్ ఆది కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కత్తి మహేశ్, హైపర్ ఆది కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫొటోల్లో ఒక దానికి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కత్తి మహేశ్.."కలిస్తే మేమూ మేమూ బాగానే ఉంటాం. విభేదాలు విషయాలకు సంబంధించి, పరిస్థితులకు లేదా సిద్దాంతాలు సంబంధించి ఉంటాయేగాని, వ్యక్తిగత వైరాలు ఉండవు. ఆ విషయం తెలియక, అర్థం కాక ఫ్యాన్స్ అనే పిచోళ్ళు నానా రభసా చేసి, వాళ్ళ జీవితాలు పాడుచేసుకున్తున్నారు.

Recommended