• 7 years ago
BJP leader and Rajya Sabha member Subramanian Swamy on Saturday alleged that senior government officials from the Central Statistical Organisation (CSO) were pressured by the Narendra Modi government to dish out data to show that demonetisation had no adverse impact on the economy and the GDP numbers.


బీజేపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (సీఎస్‌ఓ) అధికారులపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సీఎస్‌వోలోని సీనియర్ అధికారులపై నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. నోట్ల రద్దుతో ఎలాంటి నష్టం లేదని, అలాగే జీడీపీ విషయంలోను మంచి డాటా ఇవ్వాలని ఒత్తిడి ఉందని వ్యాఖ్యానించారు.
ఆయన అహ్మదాబాదులో చార్టర్డ్ అకౌంటెంట్‌ల సమావేశంలో మాట్లాడారు. త్రైమాసిక (జీడీపీ) డాటాను అనుసరించవద్దని, అదంతా బోగస్ అని వ్యాఖ్యానించారు. సీఎస్‌ఓను తన తండ్రి తీసుకు వచ్చారని, తాను ఇటీవలే కేంద్రమంత్రి సదానంద గౌడతో అక్కడకు వెళ్లానని స్వామి అన్నారు.
ఆ సమయంలో తాను సీఎస్‌ఓ డైరెక్టర్‌ను జీడీపీ గురించి అడిగానని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. నోట్ల రద్దు ప్రభావం ఉందని, కానీ లేదని చెప్పే ప్రయత్నాలు చేయడంతో తాను ఆ అధికారిని అడిగానని చెప్పారు.

Category

🗞
News

Recommended