గోవా బీచ్‌లో శవమై తేలిన హీరో...!

  • 6 years ago
Malayalam actor Sidhu R Pillai, who starred in Second Show, was found his body in Goa, reports Malayalam Manorama. He was 27. His body was identified by his mother on Monday, the report adds.

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు, 'సెకండ్ షో' అనే చిత్రంలో నటించిన సిద్దు ఆర్ పిళ్లై(27) గోవా బీచ్‌లో సోమవారం శవమై తేలాడు. సిద్ధు మరణంతో మలయాళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
షూటింగ్ గ్యాప్ దొరకడంతో కాస్త రిలాక్స్ అయ్యేందుకు, ఎంజాయ్ చేసేందుకు సిద్ధు జనవరి 12వ తేదీన గోవా వచ్చాడు. బీచ్‌లో పడి ఉన్న గుర్తు తెలియని మృతదేహం తన కొడుకు సిద్ధుదే అని అతడి తల్లి గుర్తించినట్లు మలయాళ మీడియాలో వార్తలొచ్చాయి.
సిద్ధు మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సిద్ధూకు స్విమ్మింగ్ వచ్చని, నీటిలో మునిగి చనిపోయే అవకాశం అయితే లేదని సన్నిహితులు అంటున్నారు. దీంతో పోలీసులు అతడి మరణానికి కారణాలు ఏమిటనే దానిపై ఆధారాలు సేకరిస్తున్నారు.
దుల్కర్ సల్మాన్ తెరంగ్రేట మూవీ ‘సెకండ్ షో' ద్వారానే సిద్ధు కూడా నటుడిగా పరిచయం అయ్యాడు. ఈచిత్రంలో అతడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2012లో ఈచిత్రం విడుదలైంది. ఈ సినిమా తర్వాత సిద్ధు పలు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు.

Recommended