Sye Raa Vs NTR Biopic clash?

  • 6 years ago
Chiranjeevi's Sye Raa Narasimha Reddy and Balakrishna's NTR biopic will going to release for 2019 summer. both movies are crazy projects in Tollywood. These two movies are rising expectations among the fans.

మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య సినిమాలు ఎప్పుడు విడుదలైనా వీరి అభిమానులకు పండగే. గతంలో పలు మార్లు ఈ టాప్ హీరోలు ఇద్దరూ వారి చిత్రాలతో పోటీ పడ్డ సందర్భాలు ఉన్నాయి. బాలయ్య, చిరంజీవి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్దకు ఒకేసారి వస్తున్నాయంటే అభిమానుల్లో చిత్ర పరిశ్రమలో ఉండే సందడే వేరు. గతంలో బాలయ్య, చిరు పోటీ పడ్డ సందర్భాలు వేరు.. ఇప్పుడు పోటీపడుతున్న సందర్భం వేరు. ఎందుకంటే ఈ హీరోలిద్దరూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్రాలు 2019 వేసవిలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి చిత్రంలో నటిస్తునారు. బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ రెండు చిత్రాలు వేసవి బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి చిత్రం తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలా వాడ నరసింహ రెడ్డి చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా చిరంజీవి సరికొత్త గెటప్ లో కనిపించనున్నారు.
బాలకృష్ణ ఇప్పటికి వరకు 102 చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి ఉండొచ్చు. కానీ తొలిసారి తన తండ్రి పాత్రలో నటించనుండడం మాత్రం బాలకృష్ణకు పెద్ద సవాల్ అని చెప్పొచు. అందుకే తన తండ్రి జీవిత గాధ ప్రతి ఒక్క తెలుగువాడిని మెప్పించేలా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Recommended