షేమ్.. షేమ్... నటి శ్రీదేవి మృతిపై కాంగ్రెస్ రాజకీయం! | Oneindia Telugu

  • 6 years ago
Bollywood actor Sridevi passed away after a massive cardiac arrest on Saturday (February 24) night. The actor was 54 and was in Dubai, attending the wedding of Mohit Marwah with husband Boney and younger daughter Khushi.

బాలీవుడ్ నటి శ్రీదేవి మృతిపై పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె హఠాన్మరణంపై కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్‌లో ప్రగాఢ సానుభూతి తెలిపింది. అయితే, కాంగ్రెస్ పార్టీ చేసిన పూర్తి ట్వీట్ చదివిన తర్వాత నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎం జరిగింది అంతే 2013లో యూపీఏ హయాంలో ఆమెకు పద్మశ్రీ వచ్చింది, అయితే ఓ వైపు ఆమె చనిపోయి, అందరూ విచారంలో ఉన్న సమయంలో తమ హయాంలో శ్రీదేవికి పద్మశ్రీ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొనడం విచారకరమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది ఇలా ఉండగా కాంగ్రెస్, రాహుల్ గాంధీలు ఇలాంటి సమయంలో నిజంగానే మానత్వంతో ట్వీట్ చేశారా అని ఓ ట్విట్టరిటీ ప్రశ్నించారు, అలాగే సందీప్ ఘోస్ స్పందిస్తూ.. పద్మ అవార్డులు భారత ప్రభుత్వం సిటిజన్లకు ఇస్తుందని, కానీ ఓ రాజకీయ పార్టీ ఇవ్వదని, దీనిని బట్టి కాంగ్రెస్ తీరు అర్థమవుతోందని పేర్కొన్నారు.
అలాగే ఇలాంటి సమయంలో రాజకీయం అవసరమా అని పలువురు ప్రశ్నిస్తు, మాననత్వం లేకుండా మాట్లాడుతున్నారని, ఇది తీవ్ర అవమానకరమని పేర్కొటున్నారు.

Recommended