మళ్ళీ మొదలైన మహేష్ ట్వీట్లు...!

  • 6 years ago
Cine critic Mahesh kathi made controversial comments again on Jana Sena chief Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ క్రిటిక్ మహేష్ కత్తి మరోసారి ధ్వజమెత్తారు. జనసేన పార్ట ప్రారంభంలోనే బానిసత్వం ఉందని ఆయన వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు. పార్టీ కార్యాలయం పునాదిలోనే అవినీతి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ రాజకీయ పంథాలో జీహుజూరీ ఉందని అన్నారు. పవన్ కల్యాణ్‌ది మార్పు కోసం వస్తున్న రాజకీయం కాదని, ఏమార్చడానికి కొనసాగుతున్న పవనిజమని అన్నారు.
పవన్ కల్యాణ్‌కు ఇచ్చిన భూమి డల్ తనకు ఇస్తే పవన్ కల్యాణ్ పక్కన ప్లాట్ తీసుకుని అమరావతికి మారడానికి తాను సిద్ధంగా ఉన్నానని మహేష్ కత్తి వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ విషయంలో తలదూర్చనని గతంలో ఇచ్చిన హామీని కాదని మహేష్ కత్తి తాజాగా వ్యాఖ్యలు చేశారు
బిజెపి, తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతోనే జనసేన అధినేత ఇల్లు, జనసేన పార్టీ ఆఫీసు నిర్మాణాలు రుగుతున్నాయని మహేష్ కత్తి ఆరోపిించారు. అందుకు అభినందనలు అని కూడా ఆయన అన్నారు.
వైజాగ్ రైల్వే జోన్ కుదరకపోతే గుంతకల్ జోన్ ఇవ్వవచ్చునని, కానీ చంద్రబాబుకు మనసొప్పదని మహేష్ కత్తి అన్నారు. రాయలసీమ అంటే రాయలసీమ నాయకులకే పట్టదని ఆయన వ్యాఖ్యానించారు. మోసం చేసేవరకు మోడీ నటిస్తారని, ఆ తర్వాత పట్టించుకోడని అన్నారు.

Recommended