టీడీపీ వెళ్లిపోయినా ఎన్డీఏ ఏ మాత్రం బలహీనపడలేదు, 2019 లో కూడా మేమే !

  • 6 years ago
Despite the N Chandrababu Naidu-led Telugu Desam Party (TDP) walking out of the National Democratic Alliance (NDA) government and some other allies also sounding disgruntled, Bharatiya Janata Party chief Amit Shah has expressed confidence that the NDA will return to power in 2019 General Elections.

ఓ వైపు తమ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందంటూ ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ఆగ్రహం చేస్తూనే.. పార్లమెంటు అవిశ్వాస తీర్మానం పెడుతుండగా.. మరో వైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం ఏపీకి చాలా చేశామని అంటున్నారు.
విభజన వల్ల నష్టపోయిన ఏపీకి తగిన న్యాయం చేసేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసిందని చెప్పారు. ఏపీకి గత నాలుగేళ్లలో ఇచ్చినన్ని నిధులను సమైక్యాంధ్రప్రదేశ్‌కు కూడా ఏ కేంద్ర ప్రభుత్వమూ ఇవ్వలేదని అన్నారు. అంతేగాక, ఏపీకి ఇచ్చిన ప్రతీ పైసాకు లెక్క చెప్తామని అమిత్ షా స్పష్టం చేశారు.
ఎన్డీఏ నుంచి చంద్రబాబును తాము వెళ్లగొట్టలేదని, ఆయనే బయటకు వెళ్లిపోయారని అమిత్ షా వ్యాఖ్యానించారు. మిత్రపక్షాలు ఎవరినీ తాము బయటకు పంపాలని అనుకోలేదని, చంద్రబాబు వెళ్లాలనుకున్నప్పుడు ఎలా ఆపగలమని చెప్పారు
అంతేగాక, టీడీపీ వెళ్లిపోయినా.. తమ కూటమిలో ఇంకా 30పార్టీలున్నాయని, ఎన్డీఏ ఏ మాత్రం బలహీనపడలేదని ధీమా వ్యక్తం చేశారు. 2019 లోకసభ ఎన్నికల్లోనూ 300కి పైగా స్థానాలతో మళ్లీ అధికారంలోకి వస్తామని అమిత్ షా చెప్పారు. చంద్రబాబు వెళ్లడం వల్ల బీజేపీ దక్షిణాది కలలకు ఆటంకం కలిగిందా? అన్న ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ.. అక్కడ ఇంకా బలపడవచ్చేమో అన్నారు.
మిత్రపక్షాలు రెచ్చిపోవటం మంచిది కాదన్నది మా భావన. కానీ, వారే వెళ్లిపోతే మేం ఏమి చేయగలం. మాకు ఏపీలో ఇప్పుడు రెండు సీట్లే ఉన్నాయి. భవిష్యత్తులో పెరగవచ్చేమో. కాంగ్రెస్‌ మాదిరిగా.. అవసరాలకు తగ్గట్లు మేము వ్యవహారాలు నడపలేదు. మాకు కేంద్రంలోనూ, యూపీలోనూ పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ మిత్రపక్షాలను ప్రభుత్వాలలో చేర్చుకుని వారికి గౌరవాన్ని ఇచ్చాం' అని అమిత్ షా తెలిపారు.

Recommended