కర్ణాటక బడ్జెట్ పై ఉపేంద్ర మండిపాటు
తాను స్థాపించిన రాజకీయ పార్టీ అన్నింటిలా కాదని చెప్పిన ప్రముఖ కన్నడ సినీ నటుడు, ఉత్తమ ప్రజాకీయ పార్టీ అధినేత ఉపేంద్ర కర్ణాటక రాజకీయ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం కుమార స్వామి ప్రవేశపెట్టిన బడ్జెట్.. పేదలను పీడించే విధంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెట్రోల్, విద్యుత్ వంటి వాటిపై పన్నులు పెంచి ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం పేదలపై నేరుగా భారం మోపిందని విమర్శించారు. కొత్త బడ్జెట్తో సామాన్యులకు ప్రభుత్వం పంగనామాలు పెట్టిందంటూ సోషల్ మీడియా వేదికగా ఉపేంద్ర ధ్వజమెత్తారు.
అంతేగాక, 20శాతం బుద్ధి ఉన్న మూర్ఖులు మాత్రమే బడ్జెట్పై మాట్లాడుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు ఉద్దేశ పూర్వకంగా ఇలాంటి సమస్యలపై నోరు విప్పడం లేదని అన్నారు. అయితే, ఉపేంద్ర వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పలువురు కర్ణాటక అధికార పార్టీ నేతలు పేర్కొన్నారు. అవగాహన లేకుండానే విమర్శలు చేస్తున్నారని వారు వ్యాఖ్యానించారు.
UPP president and Karnataka Cine Hero Upendra Criticised Karnataka State Budget.
పెట్రోల్, విద్యుత్ వంటి వాటిపై పన్నులు పెంచి ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం పేదలపై నేరుగా భారం మోపిందని విమర్శించారు. కొత్త బడ్జెట్తో సామాన్యులకు ప్రభుత్వం పంగనామాలు పెట్టిందంటూ సోషల్ మీడియా వేదికగా ఉపేంద్ర ధ్వజమెత్తారు.
అంతేగాక, 20శాతం బుద్ధి ఉన్న మూర్ఖులు మాత్రమే బడ్జెట్పై మాట్లాడుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు ఉద్దేశ పూర్వకంగా ఇలాంటి సమస్యలపై నోరు విప్పడం లేదని అన్నారు. అయితే, ఉపేంద్ర వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పలువురు కర్ణాటక అధికార పార్టీ నేతలు పేర్కొన్నారు. అవగాహన లేకుండానే విమర్శలు చేస్తున్నారని వారు వ్యాఖ్యానించారు.
UPP president and Karnataka Cine Hero Upendra Criticised Karnataka State Budget.