తిరుమల ఎస్వియూలో తొలి జ్ఞాన భేరి నిర్వహించనున్న ఎపి ప్రభుత్వం

  • 6 years ago
CM Chandrababu try to makeover Andhra Pradesh into a Knowledge Hub. For this, CM has been launching a new programme in the name of "Gnana Bheri".
#GnanaBheri
#cmchandrababu
#state
#launch
#review
#svu
#GnanaBheri


నవ్యాంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షను నెరెవేర్చే దిశలో కీలకమైన కార్యక్రమానికి సిఎం చంద్రబాబు నాంది పలికారు. నాలెడ్జ్ హబ్ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు గాను ఒక బృహత్తర ప్రణాళికకు సిఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు.దీనికి సంబంధించి విశ్వవిద్యాలయాల నుంచి తక్షణమే కార్యాచరణను ఆరంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి 'జ్ఞానభేరి'గా నామకరణం చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. నాలెడ్జి ప్రమోషన్‌ విశ్వవిద్యాలయాల నుంచే జరగాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అందుకే రాష్ట్రంలోని అన్ని వర్సిటీలలో ఒక స్ఫూర్తిదాయకమైన ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని సిఎం సూచించారు.