Chandrababu is A-1 for ramateertham case | Oneindia Telugu

  • 3 years ago
Chandrababu is A-1 for ramateertham case, in the case related to the issue on the convoy of YSRCP MP Vijayasai Reddy during the visit to Ramatheertham temple in Vizianagaram

#ChandrababuA1
#VijayasaiReddyConvoy
#Ramatheerthamtemple
#Vizianagaram
#ramateertham
#YSRCPMPVijayasaiReddy
#AndhraPradesh
#APCMjagan
#YSRCPGovt
#TDP
#చంద్రబాబు నాయుడు



రామతీర్ధంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై దాడి ఘటనలో కోర్టుకు పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌ ఇచ్చారు. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు ఉంది. చంద్రబాబు ఏ1 కాగా.. అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు సహా 12 మందిని ముద్దాయిలుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురికి కోర్టు రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. రామతీర్థంలో రాళ్ల దాడికి చంద్రబాబు నాయుడు ప్రధాన కారణమని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా కళా వెంకట్రావుపై నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పార్టీ జెండాలతో రామతీర్ధం కొండపైకి వెళ్లిన విజయసాయిరెడ్డిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ దిగి బయటకు వస్తున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కారు వద్దకు నడుస్తుండగా కొంత మంది ఆందోళనకారులు చెప్పులు, వాటర్‌ ప్యాకెట్లు విసిరారు. రాయి తగిలి వాహనం ముందువైపు అద్దం స్వల్పంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.

Recommended