ఆ జీవో వెనక్కు తీసుకున్న జగన్ సర్కార్
- 3 years ago
ఏపీ గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీస్ సిబ్బందికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవో నంబర్ 59ను వెనక్కు తీసుకుంటున్నట్లు లాయర్ హైకోర్టుకు తెలియజేసింది. వారిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పడంతో.. కోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామ మహిళా సంరక్షణ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులపై హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. వీరిని పోలీస్ శాఖలో మహిళా పోలీసులుగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 59ని రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఏపీ డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్ట్లోని సెక్షన్ 1, 6, 11, 21తో పాటు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కు విరుద్ధంగా ఉందన్నారు.