మహబూబాబాద్‌లో జాతీయ జెండాకు అవమానం

  • 2 years ago
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. అటవీశాఖ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా చెత్తలో పడి ఉంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 అటవీశాఖ కార్యాలయంలో అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయంత్రం జెండాను అవగతం చేసిన ఉద్యోగులు జెండాను భద్రపరచకుండా పక్కన పడేశారు. అది గాలికి ఎగురుతూ చివరికి చెత్తకుప్పలోకి వెళ్లింది. జనవరి 26 నుంచి ఆ జెండా చెత్తకుప్పలోనే ఉన్నా ఎవ్వరూ కనీసం పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

Recommended