ఎంపీ అర్వింద్ ఇంటిని ముట్టడించిన రైతులు ఏం చేశారంటే?

  • 2 years ago
ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిని మంగళవారం ఉదయం కొందరు రైతులు ముట్టడించారు. ట్రాక్టర్‌లో వడ్లు తెచ్చి ఆయన ఇంటి ముందు పోసి నిరసనకు దిగారు.. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్‌, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రమే వడ్లు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

Recommended