సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం

  • 7 days ago
రాష్ట్రంలో మహిళాభివృద్ధికి మరొక అడుగు పడింది. మహిళా శక్తి క్యాంటీన్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని ద్వారా ఉపాధి కలగటమే కాకుండా మహిళలు వ్యాపారం రంగంలో రాణిస్తారని ఈ కార్యక్రమాన్ని మొదలెట్టింది. సచివాలయంలో రెండు మహిళా క్యాంటిన్లను మంత్రి సీతక్క ప్రారంభించారు. మరో రెండేళ్లలో జిల్లాకి ఐదు చొప్పున క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.