రేపు ఉదయం 6గంటలకు రూ.7వేల పింఛన్

  • yesterday
Pension Distribution Arrangements: ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పింఛన్‌ సొమ్మును జూలై 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 6 గంటల నుంచే నగదు పంపిణీ చేపట్టాలని, తొలిరోజే 90శాతం పూర్తవ్వాలని ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పింఛన్‌ సొమ్ముతోపాటు వాస్తవ పరిస్థితులను వివరిస్తూ సీఎం చంద్రబాబు సంతకంతో కూడిన లేఖను సైతం సచివాలయం సిబ్బంది అందించనున్నారు.