కాకినాడ కేంద్రంగా ఆఫ్రికన్ దేశాలకు రేషన్ బియ్యం

  • yesterday
Ration Rice Illegal Transportation: పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. కాకినాడ కేంద్రంగా వేల టన్నులు దేశసరిహద్దులు దాటిపోతోంది. పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ కాకినాడ గోదాముల్లో నిల్వచేసిన రేషన్‌ బియ్యాన్ని ప్రత్యక్షంగా తనిఖీలు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని సీజ్ చేయడంతోపాటు పలువురిపై కేసులు నమోదుకు ఆదేశించారు. మొత్తం వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించనున్నట్లు మంత్రి మనోహర్‌ తెలిపారు.