• 42 seconds ago
Aero India 2025 : ఉద్యాన నగరి బెంగళూరు..మరోసారి ఏరో ఇండియా షో కార్యక్రమానికి వేదికైంది. బెంగళూరు శివార్లలోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. వైమానిక, నౌకాదళాలు వినియోగించే రక్షణ పరికరాలు, అత్యాధునిక క్షిపణులను ప్రదర్శనకు ఉంచారు. రష్యా రూపొందించిన ఎస్‌యూ-57, అలాగే అమెరికాకు చెందిన ఎఫ్‌-35 లైట్నింగ్‌ 2 విమానాలను ఈ షోలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.
#AeroIndia2025
#AeroIndiashow
#AeroIndia
#SukhoiSu57
#LockheedMartinF35LightningII

Category

🗞
News

Recommended