పవన్‌పై టీడీపీ నేతల భిన్న స్పందన!

  • 6 years ago
Pawan Kalyan, Janasana's chief who arrived in Arakuloya to visit Visakhapatnam district, stayed in a resort in Padmapuram.Pawan Kalyan, who arrived in Visakhapatnam district on Saturday night, has been remained in resorts entire fullday on Sunday.
#andhrapradesh
#visakhapatnam
#pawankalyan
#chandrababu
#Janasena

విజయనగరం జిల్లా పర్యటన ముగించుకుని అరకులోయ చేరుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పద్మాపురంలోని ఓ రిసార్ట్స్‌లో బస చేశారు. శనివారం రాత్రికే విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఆదివారం పూర్తిగా రిసార్టుకే పరిమితం అయ్యారు. పవన్ ఆదివారం పర్యటన కొనసాగిస్తారా లేదా అనేది ఎటువంటి సమాచారం లేకపోవడంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆదివారం వేకువజాము నుంచే పవన్ బస చేసిన రిసార్ట్స్ వద్దకు పోటెత్తారు. అయితే ఆదివారం ఉదయం రిసార్ట్స్ ఆవరణలో మార్నింగ్ వాక్ చేసిన అనంతరం అభిమానులను పలకరించిన పవన్ అరగంట తరువాత తన గదికి వెళ్లిపోయారు. మరోవైపు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లాలో పర్యటించనుండటం గమనార్హం.
శనివారం రాత్రికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పట్టణం జిల్లాలోకి అడుగుపెట్టడంతో ఆదివారం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందా? లేదా ? అనే సందేహం ఆయన అభిమానుల్లో, జనసేన పార్టీ కార్యకర్తల్లో తలెత్తింది. దీనిపై ఏదైనా ప్రకటన వస్తుందని వారు ఎదురుచూసినట్లు తెలిసింది. అయితే ఎలాంటి ప్రకటనా వెలువడకపోవడంతో ఎలాంటి ప్రకటనా వెలువడలేదు కాబట్టి పర్యటన ఉంటుందని కొందరు...ఉండదని మరికొందరు ఫిక్సయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయానికే పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అరకులో ఆయన బసచేసిన రిసార్ట్స్ వద్దకు పవన్ అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.

Recommended