మొదటి దఫా రైతు రుణమాఫీకి సిద్ధం
Crop Loan Waiver In Telangana : పంద్రాగస్టు లోగా రుణమాఫీ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణ చేస్తోంది. గురువారం తొలివిడతగా లక్ష లోపు రుణాలను మాఫీ చేయనున్నట్లు సీఎం ప్రకటించగా ఇందుకోసం రూ.8వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. ఎఫ్ఆర్బీఎమ్ పరిధికి లోబడి తీసుకున్న రుణాలతో పాటు ఇతర నిధులను మాఫీ కోసం సిద్ధంగా ఉంచినట్లు సమాచారం.