ఎన్నికలతో సంబంధం లేకుండా ముందుకెళ్లే పార్టీ బీజేపీ
Central Minister Kishan Reddy Fires on Congress : ఎన్ని రోజులు బీజేపీ, ఎన్డీఏ అధికారంలో ఉంటుందో అప్పటివరకు ఉగ్రవాదం అరికట్టబడుతుందని, మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాకిస్థాన్, ఐఎస్ఐ ఉగ్రవాదాలు ఉద్ధృతమవుతాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో అవినీతి పెరుగుతుందని, కుటుంబ పాలన పెరుగుతుందని, లైసెనస్ రాజ్, పైరవీరాజ్ వస్తుందని ధ్వజమెత్తారు. సోమాజిగూడలోని జయ గార్డెన్లో నిర్వహించిన సికింద్రాబాద్ సెంట్రల్ జిల్లా కార్యకర్తల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.