హైదరాబాద్కు ఒక్క రూపాయి తీసుకురానివాళ్లు అవసరమా?
Minister Ponnam Slams Modi Govt Over Budget 2024 : ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం, డిప్యూటీ సీఎంలకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. నగర అభివృద్ధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులు కేటాయించడం జరిగిందని వివరించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్లపై విమర్శలు చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గతంలో టూరిజం మంత్రిగా హైదరాబాద్కు ఒక్క రూపాయి తీసుకురాలేదని విమర్శించారు. అలాగే గతంలో స్మార్ట్ సిటీ వస్తే కరీంనగర్కు ఇచ్చారని ఇప్పుడు హైదరాబాద్ నగరానికి స్మార్ట్ సిటీ నిధులు తేవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గతంలో టూరిజం మంత్రిగా హైదరాబాద్కు ఒక్క రూపాయి తీసుకురాలేదని విమర్శించారు. అలాగే గతంలో స్మార్ట్ సిటీ వస్తే కరీంనగర్కు ఇచ్చారని ఇప్పుడు హైదరాబాద్ నగరానికి స్మార్ట్ సిటీ నిధులు తేవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలని ప్రశ్నించారు.