భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం

  • last month
Godavari Flood Water Rising at Bhadrachalam : భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. రాత్రి 10 గంటలకు 50 అడుగులు దాటింది. మంగళవారం ఉదయం 5 గం.కు 51.1 అడుగులకు చేరుకుంది. దాదాపు 12 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు ఉరకలెత్తుతోంది. వరద ముంచెత్తడంతో భక్తుల తలనీలాలు సమర్పించే కల్యాణ కట్టను మూసేశారు. స్నానఘట్టాలు కిందిభాగం, విద్యుత్తు స్తంభాలు మునిగాయి. కాళేశ్వరం, ఇంద్రావతి వైపు నుంచి పేరూరు మీదుగా భద్రాచలం వైపు వరద పోటెత్తడంతో ప్రతీ గంటకూ నీటి మట్టం పెరుగుతూ వస్తోంది.

Recommended