మూడు భారీ పడవలను అధికారులు విజయవంతంగా తొలగించారు
Officials Successfully Removed Three Boats stuck at Prakasam Barrage : విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్దకు కొట్టుకు వచ్చి గేట్లకు అడ్డుగా ఉన్న మూడు భారీ పడవలను అధికారులు విజయవంతంగా తొలగించారు. ప్రభుత్వ సహకారం, సిబ్బంది కృషితోనే పడవలను వెలికితీశామని ప్రభుత్వ పత్యేక అధికారి కె.వి. కృష్ణారావు తెలిపారు. సరికొత్త ప్రణాళికతో భారీ బోట్లను బెకెం ఇన్ ఫ్రా సంస్థ ఇంజినీర్లు, అధికారులు బయటకు తీశారని వివరించారు. భారీ పడవలు ప్రకాశం బ్యారేజీకి ఢీకొట్టినా ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని కృష్ణారావు తెలిపారు.
Category
🗞
News