Vidadala Rajini Investigation ACB Letter to Governor: వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీమంత్రి విడదల రజనీ వసూళ్ల దందా సాగించారు. అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనసేకుకోవాలనున్న రజనీ, ఆ రాళ్లను పిండిచేసే క్రషర్ యాజమాన్యాలపై గురిపెట్టారు. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్క్రషర్ యజమానులను ఐదు కోట్లు ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు. ఇందుకోసం తన పీఏలను రంగంలోకి దింపిన రజనీ, చివరకు అప్పట్లో రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాషువానూ ప్రయోగించారు. క్రషర్ మిల్లులో తనిఖీలంటూ భయపెట్టారు.
Category
🗞
News