హిందూవులు పిల్లల్ని కంటూనే ఉండండి: బిజెపి ఎమ్మెల్యే విక్రమ్ సైనీ
లక్నో:ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణపై ముజఫర్ నగర్లో జరిగిన ఓ బహిరంగ సభలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులు పిల్లల్ని కనడం ఆపొద్దని సూచించారు. ఇద్దరు పిల్లలు ముద్దనేది అందరికీ సమ్మతమేనని సైనీ చెప్పారు. కానీ ఇతరులు దానిని పాటించడం లేదన్నారు. చట్టం అందరికీ సమానేమనని, ఈ దేశం ప్రతి ఒక్కరిదని, హిందువులు పిల్లల్ని కనడం ఆపొద్దని సూచించారు. హిందువులు పిల్లలను కంటూనే ఉండాలని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీలోని ఖతౌలీ నియోజకవర్గం నుండి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
Category
🗞
News