After 16 years Mahesh-NTR In One Frame

  • 6 years ago
After 16 years Mahesh-NTR in one frame. 16 years back Mahesh Babu attended as Chief Guest for NTR's ‘Aadhi’ audio release event . After long time NTR graced an event relating to Mahesh Babu.


మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'భరత్ అనే నేను' ప్రీ రిలీజ్ ఫంక్షనకు యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. 'భరత్ భహిరంగ సభ' పేరుతో శనివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. చాలా కాలం తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు ఎగ్జైట్మెంటుకు గురయ్యారు.
16 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘ఆది' సినిమా ఆడియో వేడుకకు మహేష్ బాబు ముఖ్య అతిథిగా వెళ్లారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మహేష్ బాబు మూవీ ప్రి రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఇద్దరి కలయికకు సంబంధించిన ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది.
భరత్ బహిరంగ సభలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.... నేను ఈ వేడుకకు ముఖ్య అతిధిని అంటున్నారు. నేను ముఖ్య అతిధిగా రాలేదు. మహేష్ కుటుంబ సభ్యుడిగా వచ్చాను. మీరంతా ఆయన్ని ప్రిన్స్, సూపర్ స్టార్ అని అంటారు. కానీ నేను మాత్రం ఆయన్ని మహేష్ అన్న అని అంటాను అన్నారు.
ఇక మహేష్ బాబు తన ప్రసంగంలో ఎన్టీఆర్‌ను తమ్ముడూ అంటూ సంబోధించారు. తమ్ముడు ఎన్టీఆర్ నుంచి మాటలు నేర్చుకొన్నాను. ఆడియో ఫంక్షన్‌కు వచ్చినట్టు లేదు. ఈ సినిమా వంద రోజుల ఫంక్షన్‌కు వచ్చినట్టు ఉంది... అని సంతోషం వ్యక్తం చేశారు.

Recommended