ఆసక్తికరం గా మారనున్న 2019 ఎన్నికలు

  • 6 years ago
As the two telugu states are in the election mood, the politics of Andhra Pradesh have turned out to be very interesting.As per the current scenario, there is no doubt that there would be a triangular fight in the upcoming elections. Political analyst predicted YCP coming into power, provided if it ally with Janasena party. They also came to a decision that East and West Godavari districts will play a Keyrole in the coming elections.

రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా బీసీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన వైయస్ జగన్... ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చే సరికి అక్కడ ఆత్మీయ సభలుకానీ సమావేశాలు కానీ నిర్వహించలేదని... ఒకవేళ అలాంటి సమావేశాలు నిర్వహిస్తే కాపు ఓటు బ్యాంకుపై ఆ ప్రభావం పడుతుందనే కారణంతోనే జగన్ ఆచితూచి అడుగువేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు రాజకీయాన్ని అందుకోవాలంటే ఎలాంటి అవకాశాన్నైనా ఒడిసి పట్టుకోవాలని వారు సూచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు జిల్లాలు కీలకం కానున్న నేపథ్యంలో జగన్... పవన్‌తో జతకడితేనే గట్టెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు అనంతపురం జిల్లాల్లో టీడీపీకి ఎదురుగాలి వీస్తోంది. అనంతపురం జిల్లాలో బాలయ్య నియోజకవర్గం హిందూపురంలో కూడా ప్రజలు టీడీపీ పట్ల అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పవన్‌ కళ్యాణ్‌తో పొత్తు పెట్టుకుంటే జగన్‌కు అన్ని విధాలా మేలు జరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

Category

🗞
News

Recommended