ఏపీలో భారీగా ఐఏఎస్​ల బదిలీలు

  • 8 days ago
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అందరూ ఊహించినట్లుగానే చంద్రబాబు పాలనా ప్రక్షాళన చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్సీపీ నేతలతో అంటకాగిన కీలక అధికారులపై వేటు పడింది. శ్రీలక్ష్మీ, రజత్‌ భార్గవ, ప్రవీణ్‌ ప్రకాశ్, మురళీధర్‌రెడ్డికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కనపెట్టేశారు. గత ప్రభుత్వంలో వివాదస్పద అధికారులుగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్‌ కుమార్‌లకు కీలక బాధ్యతలు అప్పగించడం విస్మయపరుస్తోంది. త్వరలోనే పోలీసు శాఖలోనూ ప్రక్షాళన చేపట్టే అవకాశం ఉంది.