కేంద్ర ప్రయోజిత పథకాలపై పునఃసమీక్ష చేయాలని కోరాం
State Finance Minister Bhatti Attend in Union Budget Preparatory Meeting : కేంద్రప్రభుత్వం సెస్ సర్ఛార్జీల రూపంలో పన్నులు సేకరించడం వల్ల, రాష్ట్రాలు నష్టపోతున్నాయని కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ విధించే సర్ఛార్జీలు, సెస్లను పదిశాతం మించకుండా చూడాలని కోరానన్నారు. బడ్జెట్ ప్రవేశంపెట్టేందుకు నికర రుణపరిమితి ముందే ప్రకటించాలని కోరినట్లు మీడియా వేదికగా వివరించారు.