పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి:వినోద్
Parliament Budget Sessions 2024 : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కోరారు. ఈసారి టీడీపీపై ఆధారపడి మోదీ కేంద్ర ప్రభుత్వం నడపాల్సి వస్తుందన్నారు. అందుకే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను సాధించుకోవాలని ఎంపీలకు సూచించారు. కాగా సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు గత 15 రోజుల నుంచి కేంద్రానికి ఎలాంటి వినతిపత్రాలు ఇవ్వలేదని వినోద్ ఆక్షేపించారు.