సింగరేణి ప్రైవేటీకరణకు ఆ రెండు పార్టీలు కుట్ర
- 2 days ago
BRS Leader KTR on Singareni Coal Mines Privatization : తెలంగాణ గొంతుకు పార్లమెంటులో లేదన్న భ్రమతోనే కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణి ప్రైవేటీకరణ కోసం కుటిల ప్రయత్నం చేస్తున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణి ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని ఆరోపించారు. సింగరేణి ప్రాంత మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో ఆయన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు.