భద్రాచలం వద్ద క్రమంగా తగ్గుతున్న గోదావరి
Bhadrachalam Godavari Flood Flow Decrease : భద్రాచలం వద్ద గోదారమ్మ శాంతించింది. శనివారం రాత్రి వరద ఉద్ధృతి 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆదివారం ఉదయం 7 గంటలకు 52.8 అడుగులకు తగ్గడంతో మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ఇవాళ రాత్రి 9 గంటలకు 47.8 అడుగులకు తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరిక విరమించారు. ప్రస్తుతం 43.8 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పుడు 43 అడుగుల కంటే తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా తొలగిస్తారు.
గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో లోతట్టు ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. భద్రాచలం పట్టణంలోని కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీల్లో వరదనీరు చేరింది. ఈ రెండు కాలనీలలో బాధితులు స్థానిక కుర్రాజుల గుట్టలోని కొండరావు కేంద్రంలో తలదాచుకుంటున్నారు. భద్రాచలం నుంచి చింతూరు వెళ్లే ప్రధాన రహదారిలో స్థానిక శిశు మందిరం వద్ద రోడ్డుకు అడ్డుగా కట్ట ఏర్పాటు చేశారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో గోదావరి ఘాట్ల వద్ద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో భక్తులను స్నానాలకు అనుమతించడం లేదు.
గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో లోతట్టు ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. భద్రాచలం పట్టణంలోని కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీల్లో వరదనీరు చేరింది. ఈ రెండు కాలనీలలో బాధితులు స్థానిక కుర్రాజుల గుట్టలోని కొండరావు కేంద్రంలో తలదాచుకుంటున్నారు. భద్రాచలం నుంచి చింతూరు వెళ్లే ప్రధాన రహదారిలో స్థానిక శిశు మందిరం వద్ద రోడ్డుకు అడ్డుగా కట్ట ఏర్పాటు చేశారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో గోదావరి ఘాట్ల వద్ద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో భక్తులను స్నానాలకు అనుమతించడం లేదు.
Category
🗞
NewsTranscript
02:00You