రేపే పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్​ కుమార్‌ గౌడ్‌ - సీఎం రేవంత్​ నుంచి బాధ్యతల స్వీకరణ

  • 2 days ago
Mahesh will Take Charge as PCC President : రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడిగా రేపు మహేశ్​ కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి నుంచి మహేశ్​ కుమార్‌ గౌడ్‌ పదవీ బాధ్యతలను స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు ఏఐసీసీ నాయకులు, మంత్రులు, దీపాదాస్‌ మున్షీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటుకు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ చర్యలు తీసుకుంటున్నారు.

Category

🗞
News

Recommended