ఎమ్మెల్యే సునీత నివాసంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి
Attack on Narsapur MLA's House : నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడిని బీఆర్ఎస్ ఖండించింది. కాంగ్రెస్ నాయకత్వ ప్రోత్సాహంతోనే ఈ ఘటన జరిగిందని హరీశ్రావు ఆరోపించారు. వినాయక నిమజ్జనం నెపంతో ముందస్తు కుట్రతోనే కాంగ్రెస్ నేతలు దాడికి తెగబడ్డారని సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Category
🗞
News