సాయం అందలే సారూ - వరద పరిహారం కోసం బాధితుల నిరీక్షణ

  • 15 hours ago
Floods in Khammam : వరద విలయంతో సర్వం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న వరద బాధితులు కష్టాలు అన్ని ఇన్ని కావు. చేతిలో చిల్లిగవ్వ లేక ఆపన్నహస్తం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. బాధితులకు తక్షణ సాయంగా ప్రభుత్వం ప్రకటించిన రూ.16.500 పరిహారం కొంతమందికి అందని ద్రాక్షగానే మారింది. ఇరుగుపొరుగు వాళ్ల ఖాతాల్లో పరిహారం సొమ్ము జమ అయ్యిందని తెలుసుకుని, ప్రభుత్వ కార్యాలయాలకు బాధితులు పరుగులు పెడుతున్నారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

Category

🗞
News

Recommended