• 1 hour ago
Group-1 Candidates Protest : గ్రూప్-1 పరీక్షలు రద్దుచేయాలంటూ అభ్యర్థులు ఇవాళ కూడా ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ గాంధీనగర్‌లోని పార్కుకు పెద్దఎత్తున తరలివచ్చిన అభ్యర్థులు ఈనెల 23నుంచి నిర్వహించే పరీక్షలు రద్దు చేయాలని కోరారు. జీవో నెంబర్ 29 రద్దుచేసి పాత పద్ధతిలోనే జీఓ నెంబర్ 55ను యధావిధిగా కొనసాగించాలని నినదించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన అభ్యర్థులను పోలీసులు అరెస్ట్‌ చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకి తరలించారు. గ్రూప్‌-1పై ఉన్న కేసులన్నీ తొలగిన తర్వాతే మెయిన్స్ పరీక్ష నిర్వహించకపోతే తాము తీవ్రఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు అన్నారు. మరికొందరు అభ్యర్థులు రాత్రి 9 గంటల సమయంలో అశోక్​నగర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు.

Category

🗞
News

Recommended