• 2 days ago
Private Travels Bus Stop : కుంభమేళా వెళ్లేందుకు ఓ ప్రైవేట్ ట్రావెల్స్​ బస్సులో టికెట్ బుక్ చేసుకున్న కొంతమంది ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. డ్రైవర్ బస్సును రోడ్డుపై వదిలేసి వెళ్లిపోవడంతో భక్తులంతా దిక్కుతోచని స్థితిలో రహదారిపైనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. మేడ్చల్ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లేందుకు బెంగళూరు, కర్నూలు, హైదరాబాద్​కు చెందిన పలువురు ప్రయాణికులు ధనుంజయ ట్రావెల్స్​ అనే ఓ ప్రైవేట్ ట్రావెల్స్​ బస్సులో టికెట్లు బుక్​ చేసుకున్నారు. బెంగళూరు నుంచి వస్తున్న ఆ బస్సు హైదరాబాద్​ మెహిదీపట్నం చేరుకోగానే రిపేర్ రావడంతో, ట్రావెల్స్ యాజమాన్యం మరో బస్సును ఏర్పాటు చేసి అందరినీ అందులోకి మార్చింది.
అయితే తాము స్లీపర్ బస్సు బుక్​ చేసుకుంటే, ఇప్పుడు మినీ స్లీపర్ బస్సు ఏర్పాటు చేశారని, అందులోనూ తగినన్ని సీట్లు లేవని ప్రయాణికులు బస్సు డ్రైవర్​తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే మేడ్చల్​ వద్ద డ్రైవర్ బస్సును నిలిపివేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో దాదాపు 3 గంటల పాటు జాతీయ రహదారిపైనే వేచి ఉన్న భక్తులు, చేసేదేమీ లేక చివరకు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరా తీయగా, చిన్న పిల్లలు, మహిళలతో రోడ్డుపై వేచి ఉన్నామని, గంటలు గడుస్తున్నా ట్రావెల్స్ యాజమాన్యం సరైన పరిష్కారం చూపలేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Category

🗞
News
Transcript
00:00And we'll see you next time.
00:01Bye-bye.
00:30We're coming from Kurnool.
00:50We booked a ticket from Kurnool to Prayagaraj online.
00:55We booked a bus from Prayagaraj.
00:58The bus was slow.
01:00They changed the bus in Medhi.
01:03Everyone booked a sleeper.
01:06The bus is coming from Bengaluru.
01:09There was half a sleeper and half a semi-sleeper.
01:14The sleeper asked for a sleeper.
01:17The driver put it here and left.
01:21The sleeper asked for a sleeper.
01:24The price of the sleeper is different.
01:27The driver put it here and left.

Recommended