Minister Lokesh Distributed Permanent House Pattas On Fourth Day : లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) పేరిట నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీప్ పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తామన్నారు. 50 రోజుల్లో పాఠశాల రూపురేఖలు మారిపోవాలని పట్టుదలతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడలో రిటైనింగ్వాల్ నిర్మించినట్లే మంగళగిరి నియోజకవర్గ పరిధిలో కృష్ణానది వెంబడి 300 కోట్ల రూపాయల వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మించనున్నట్లు లోకేశ్ ప్రకటించారు.
Category
🗞
News