వానలు దంచికొడుతున్నా తీరని తాగునీటి కష్టాలు
Severe Water Crisis in Kurnool: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తుంటే, ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాత్రం నీటి ఎద్దడి ఏర్పడింది. నీళ్లో రామచంద్రా అంటూ కొన్ని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యని పట్టించుకోని అధికారులు, జల్ జీవన్ మిషన్, రక్షిత మంచి నీటి పథకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెప్పటంతో ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.