మున్నేరు వరద మిగిల్చిన నష్టం
Drinking Water Schemes Damaged: మున్నేరు వరద సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. గతంలో ఎన్నడూ లేనంతగా వరద పోటెత్తడంతో ఇళ్లు, పంట పొలాలు కొట్టుకుపోయాయి. ఇప్పుడు వరద తగ్గడంతో నష్టం అంచనాలు లెక్కకు మించిపోతున్నాయి. ముఖ్యంగా మున్నేరుపై ఉన్న తాగునీటి పథకాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. వరద బీభత్సానికి పైపులు, మోటార్లు కొట్టుకుపోయాయి. ఫలితంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో సుమారు 50 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
Category
🗞
News