3 రోజులుగా నిలిచిపోయిన 'మీ సేవ'లు - తీవ్ర ఇక్కట్లు పడుతున్న దరఖాస్తుదారులు

  • 2 days ago
Mee Seva Services not Working : రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా మీ - సేవ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కుల ధ్రువీకరణ పత్రం మొదలుకొని స్కాలర్​షిప్ వరకు ఇలా ప్రతి అవసరానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీ సేవ కేంద్రానికి వెళ్లక తప్పదు. మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తరువాతే సంబంధిత కార్యాలయాల నుంచి ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతాయి. ఈ సర్టిఫికెట్లు కూడా మీ సేవ కార్యాలయాల నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ దాదాపు మూడు రోజులుగా నిలిచిపోయింది. దీంతో ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు చెప్పులరిగేలా ఈ సేవల చుట్టూ తిరుగుతున్నారు.

Category

🗞
News

Recommended