NANDAMURI BALAKRISHNA IN NIMMAKURU: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆయన స్వగ్రామమైన నిమ్మకూరులో పర్యటించారు. గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామస్థులతో మాటామంతి కలిపారు. గ్రామంలోని పెద్దలను, బంధువులను బాలకృష్ణ ఆప్యాయంగా పలకరించారు. వారి ఆరోగ్య, కుటుంబ విషయాలను పేరుపేరునా అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిమ్మకూరులోని తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకంల కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Category
🗞
News