2,450 ఎకరాల భూమి గుర్తింపు..!! || AP Govt Concentrated On Donakonda To Develop As Indusrtial Hub

  • 5 years ago
AP Govt concentrated on Donakonda to develop as Indusrtial Hub. Govt submitted proposals to central govt with local facilities and future plannings. Shortly govt may announce policy.
#apgovt
#capital
#amaravati
#donakonda
#Jagan
#ysrcp
#bjp
#IndusrtialHub

దొనకొండ కొద్ది రోజులుగా ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పేరు. అమరావతి గురించి మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలతో మరో సారి దొనకొండ అంశం తెర మీదకు వచ్చింది. అయితే, ప్రభుత్వం మాత్రం దొనకొండ విషయంలో కీలక అడుగులు వేస్తోంది. అమరావతిలో రాజధాని ఉంటుందా..ఉండదా అనే దానికి మాత్రం స్పష్టత ఇవ్వటం లేదు. దీని పైన సందేహాలు..అంచనాలు కొనసాగుండగానే దొనకొండ పైన ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. ఏపీలో అన్ని ప్రాంతాలు డెవలప్ చేయటమే తమ లక్ష్యం అని చెబుతోంది. ఇప్పటికే దొనకొండలో 2,450 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించింది. దీని ద్వారా గతంలో కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసినా..ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడ కీలక నిర్ణయాలు అమలు దిశగా కార్యాచరణ సిద్దం చేస్తోంది.

Category

🗞
News

Recommended