Record Hundi Collections In Tiurmala : కొవిడ్ తర్వాత ఇంత ఆదాయం ఇదే..! | ABP Desam
కలియుగ వైకుంఠనాధుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు దాటిపోయినా...వచ్చే భక్తులు మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. రోజూ 6౦ నుంచి 80 వేలకుపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. శ్రీవేంకటేశ్వరుడికి భక్తులు సమర్పించే కానుకలు సైతం రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి.