లాల్​దర్వాజ సింహవాహిని బోనాల సందడి

  • 3 months ago
Bonalu Festival in Hyderabad : హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో ఆదివారం బోనాల సందడి ప్రారంభమైంది. ఈ క్రమంలో లాల్​దర్వాజ బోనాల వేడుకను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అలాగే చార్మినార్​ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్రమంత్రి బండి సంజయ్​, బండారు దత్రాత్రేయ దర్శించుకున్నారు. మరోవైపు అంబర్​పేటలోని మహంకాళీ అమ్మవారికి కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.

పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభీక్షంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. కోవిడ్​ సమయంలో మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని కోరుకున్నారని, ఆ సమయంలో ప్రజలందరి మీద తల్లి ఆశీస్సులున్నాయని చెప్పారు. గతేడాది వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలని, పాడి పంటలతో ప్రజలంతా ఆనందంగా జీవించాలని కోరుకున్నట్లు చెప్పారు.

Category

🗞
News

Recommended