అనారోగ్యాల బారిన పడుతున్న గురుకుల విద్యార్థులు - ఒక్క రోజులోనే ముగ్గురికి అస్వస్థత

  • last month
Gurukul Students Suffering From Illnesses : ములుగు జిల్లాలోని బండారుపల్లి తెలంగాణ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. 12గంటల వ్యవధిలోనే ముగ్గురు ఆసుపత్రుల పాలవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గురువారం రాత్రి 8వ తరగతి విద్యార్థి అస్వస్థతకు గరికావడంతో, ఉపాధ్యాయులు ఆ బాలుడిని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించగా ఏదో విష పురుగు పట్టిందని డాక్టర్లు తెలపడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం తరలించి చికిత్స అందిస్తున్నారు.

శుక్రవారం ఉదయం తెల్లవారుజామున పదో తరగతి చదువుతున్న మరో విద్యార్థి కడుపు నొప్పితో బాధపడుతుండగా, ఆసుపత్రి తీసుకెళ్లారు. నొప్పి తీవ్ర కావడంతో బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తున్నారు.

Category

🗞
News
Transcript
00:30Yeah, yeah, yeah, yeah.
01:00Yeah, yeah, yeah, yeah, yeah.

Recommended