Home Minister Helps Student in Palnadu District : సోదరుడితో ద్విచక్రవాహనంపై కళాశాలకు వెళుతూ ప్రమాదవశాత్తు మూర్ఛ వచ్చి కిందపడిన యువతికి హోంమంత్రి అనిత సపర్యలు చేసి మానవత్వం చాటుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట వై జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. హోంమంత్రి అనిత గుంటూరు - కర్నూలు రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్తున్నారు. అదే సమయంలో శావల్యపురం మండలం కారుమంచికి చెందిన లలిత అనే బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన సోదరుడితో ద్విచక్రవాహనంపై అటుగా వెళుతున్నారు.
Category
🗞
NewsTranscript
01:00Thank you so much.