త్రిష, శింబుపై ప్రముఖ నిర్మాత ఫైర్

  • 7 years ago
At the Annadurai audio launch, producer Gnanavel Raja indirectly took a dig at Kollywood superstars Simbu and Trisha. The producer also praised Vijay Antony for making a career on his own.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో త్రిష హవా కొనసాగుతూనే ఉంది. మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినా తన కెరీర్‌కు ఎలాంటి ముప్పు లేకుండా చేసుకొంటున్నది. హీరోయిన్‌గా సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో వివాదాలు కూడా త్రిష ఎదుర్కొన్నది. తాజాగా త్రిషపై ఓ నిర్మాత తీవ్ర విమర్శలు చేయడం తమిళ చిత్రపరిశ్రమలో వివాదాస్పదమైంది.
సీనియర్ నటి త్రిష, శింబుపై ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా తీవ్ర ఆరోపణలు చేయడం దక్షిణాది మీడియాలో చర్చనీంశమైంది. విజయ్ ఆంటోని నటించిన అన్నాదురై (తెలుగులో ఇంద్రసేన) ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు మీడియాలో పెద్ద దుమారమే చెలరేగుతున్నది.
అన్నాదురై ఆడియో ఆవిష్కరణ వేడుకలో ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. విజయ్ ఆంటోనిని చూసి చాలా మంది నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎవరిపైన ఎలాంటి భారం మోపకుండా కెరీర్‌ను రూపుదిద్దుకోవడం విజయ్‌ ఆంటోనిని చూసి నేర్చుకోవాలి అని అన్నారు.
ఇంతవరకు బాగానే ఉంది. ఇద్దరు అన్‌ప్రొఫెషనల్ యాక్లరు అని ధ్వజమెత్తిన తీరుపై అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. హీరోయిన్ త్రిషా కృష్ణన్, శింబును ఉద్దేశించి చేసినవేనని మీడియా, అతిథులు ఓ అవగాహనకు వచ్చారు.

Recommended