Skip to playerSkip to main contentSkip to footer
  • 12/2/2024
నెల్లూరు జిల్లా కోవూరు మండలం జమ్మిపాలెం వద్ద పెన్నా నది వరద ప్రవాహంలో చిక్కుకున్న ఆరుగురిని అధికారులు అతికష్టం మీద కాపాడి ఒడ్డుకు చేర్చారు. జమ్మిపాలెం గ్రామానికి చెందిన ఆరుగురు పశువులు మేపేందుకు పెన్నా నదిలోకి వెళ్లారు. సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చెయ్యడంతోపాటు, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నదిలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. ప్రవాహ ఉద్ధృతి అధికంగా ఉండటంతో నది మధ్యలో చిక్కుకున్న వారు ఎటూ వెళ్లలేక అక్కడే చిక్కుకుపోయారు.

Category

🗞
News

Recommended