It's A Victory For Press Freedom

  • 6 years ago
The Supreme Court on Monday dismissed a defamation plea filed against Amoda Publications, which prints Telugu newspaper Andhra Jyothi for bringing disrepute to YSR Congress President YS Jagan Mohan Reddy. The plea was filed by YSR Congress party MLA Alla Rama Krishna Reddy.

అప్పట్లో వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోడీతో భేటీ అయినప్పుడు.. మరుసటిరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో 'అమ్మ జగనా' పేరుతో ఒక కథనం ప్రచురితమైంది. జగన్ పైకి చెబుతున్నది ఒకటి.. లోపల మోడీతో జరిపిన మంతనాలు మరొకటి అనే ఉద్దేశంతో ఆ కథనాన్ని ప్రచురించింది.
ఈ కథనం పాఠకులను పూర్తిగా తప్పుదోవ పట్టించేలా.. నిజాలను వక్రీకరిస్తూ సాగిందని వైసీపీ భగ్గుమన్నది. దీనిపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి సుప్రీం దాకా వెళ్లారు. కానీ అక్కడ కూడా జగన్ కు ప్రతికూలంగానే తీర్పు వెలువడటం గమనార్హం.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఖన్విల్కర్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు సోమవారం ఆళ్ల రామ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు వచ్చింది. అయితే ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదంటూ దాన్ని తోసిపుచ్చింది ధర్మాసనం. అంతేకాదు, అసలు ఈ కథనానికి 'పరువు నష్టం'కు లింకే లేదని ప్రధాన న్యాయమూర్తి తేల్చి చెప్పారు. దీంతో వైసీపీకి భంగపాటు తప్పలేదనే చెప్పాలి.
పిటిషన్ విచారణ సందర్భంగా ఆంధ్రజ్యోతి తెలుగులో ప్రచురించిన కథనానికి ఇంగ్లీషు అనువాదాన్ని న్యాయమూర్తికి చదివి వినిపించారు పిటిషనర్ తరుపు న్యాయవాది. ఆయన వార్తను చదువుతుండగానే.. మధ్యలోనే కలగజేసుకున్న న్యాయమూర్తి.. 'ప్రముఖుల భేటీలు జరిగినప్పుడు ఇలాంటివి సహజం.. ప్రజా జీవితంలో ఉన్నవారు ఇంత సున్నితంగా ఉండకూడదు' అంటూ న్యాయమూర్తి స్పష్టం చేశారు.
విమర్శలను సంయమనంతో, సహనంతో ఎదుర్కోవడమో, నవ్వి వదిలేయడమో చేయాలని న్యాయమూర్తి పిటిషనర్ కు వెల్లడించారు. కాగా, ఇదివరకే ఈ పిటిషన్ హైకోర్టులోనూ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. సుప్రీంలో కేసు విచారణ సందర్భంగా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. పిటిషన్ కొట్టివేసిన సమయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలను కొట్టివేయాలని పిటిషనర్ తరుపు న్యాయవాది కోరారు. దీనికి కూడా సుప్రీం అంగీకరించలేదు.

Category

🗞
News

Recommended